నేటి నుంచి బీటింగ్ రీట్రీట్ పునః ప్రారంభం

 నేటి నుంచి బీటింగ్ రీట్రీట్ పునః ప్రారంభం

లోక‌ల్ గైడ్ :
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులతో నిర్వహించే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పంజాబ్‌లోని మూడు జాయింట్ చెక్‌పోస్టుల వద్ద ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం నేటి సాయంత్రం నుంచే తిరిగి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అయితే, ఈ సందర్భంగా కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ముఖ్యంగా బీటింగ్ రీట్రీట్ సమయంలో పాకిస్తాన్ బార్డర్ గేట్లు తెరిచేలా అధికారులు సూచనలు జారీ చేశారు.తొలిరోజు ఈ కార్యక్రమాన్ని కేవలం మీడియా ప్రతినిధులకే అనుమతిస్తారు. ఇక రేపటి నుంచే సాధారణ ప్రజానీకానికి కూడా కార్యక్రమం వీక్షించేందుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు