ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు – కొత్త ఆటగాళ్లకు అవకాశాలు

రికెల్టన్, కార్బిన్, విలాక్స్ గైర్హాజరుతో బెయిర్ స్టో, గ్లీసన్, అసలంక జట్టులోకి – ప్లేఆఫ్స్ ఆశలు బతికించుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో విజయాలు తప్పనిసరి

ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు – కొత్త ఆటగాళ్లకు అవకాశాలు

 లోకల్ గైడ్ ముంబై:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పలు వ్యక్తిగత కారణాల వల్ల రికెల్టన్, కార్బిన్, విలాక్స్ లాంటి విదేశీ ఆటగాళ్లు ఈ సీజన్ మిగతా భాగాన్ని మిస్ కానున్న నేపథ్యంలో, వారిని రీప్లేస్ చేస్తూ జట్టు కొత్త ఆటగాళ్లను ప్రకటించింది.

ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా వెల్లడించింది. ఆ ప్రకారం ఇంగ్లాండ్‌కు చెందిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో, పేసర్ రిచర్డ్ గ్లీసన్, శ్రీలంక ఆల్‌రౌండర్ చరిత్ అసలంకలను కొత్తగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్లేఆఫ్స్ దశ నుంచి జట్టుకు అందుబాటులో ఉంటారని క్లబ్ పేర్కొంది.

ఇక ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌ చేరాలంటే రాబోయే రెండు లీగ్ మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మధ్యమధ్య స్థాయిలో ఉన్న ముంబై, తిరిగి టాప్-4లోకి వచ్చేందుకు విజయం తప్పనిసరి.

ఈ పరిణామాలతో ముంబై అభిమానుల్లో కొత్త ఆశలు మెలుగుతున్నాయి. కొత్త ఆటగాళ్ల రాకతో జట్టు తుది దశలో పుంజుకొని ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుందేమో చూడాల్సిందే.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఒకరు మ్యాచ్ను అద్భుతంగా ముగించగలడు, మరొకరు అద్భుతంగా ప్రారంభించగలడు వారు ఎవ‌రో తెలుసా.... ఒకరు మ్యాచ్ను అద్భుతంగా ముగించగలడు, మరొకరు అద్భుతంగా ప్రారంభించగలడు వారు ఎవ‌రో తెలుసా....
లోక‌ల్ గైడ్ : ఈరోజు రాత్రి 7:30 గంటలకు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది....
కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి
పుష్కరాల్లో సరస్వతి నవరత్నమాల హారతి
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జరిమానాలు రూ.12 వేల కోట్లు!
మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ నోటీసులు
“మాకూ టైమ్ వస్తుంది... అప్పుడు చూపిస్తాం”: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు – కొత్త ఆటగాళ్లకు అవకాశాలు