దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జరిమానాలు రూ.12 వేల కోట్లు!

కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే వసూలు – బెంగళూరులో ఓ వ్యక్తికి రూ.3 లక్షల ఫైన్

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జరిమానాలు రూ.12 వేల కోట్లు!

లోక‌ల్ గైడ్ :

భారతదేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, గత ఏడాది మొత్తం ట్రాఫిక్ జరిమానాల మొత్తం రూ.12 వేల కోట్లకు చేరుకుందని ఓ తాజా నివేదిక వెల్లడించింది. అయితే, అందులో కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే వసూలైనట్లు పేర్కొనడం గమనార్హం.నివేదిక ప్రకారం, ఈ జరిమానాల్లో సుమారుగా 55 శాతం జరిమానాలు కార్లకు సంబంధించగా, మిగిలిన 45 శాతం ద్విచక్ర వాహనాలకు సంబంధించినవిగా వెల్లడించింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.బెంగళూరులోని ఓ ద్విచక్ర వాహనదారుడు అత్యధికంగా 500 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, ఏకంగా రూ.3 లక్షల జరిమానా చెల్లించాడని నివేదిక తెలిపింది. ఈ ఘటన ట్రాఫిక్ నియమాలపై ప్రజల అవగాహనలో లోపాన్ని మరోసారి స్పష్టంచేస్తోంది.అధికారులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై మరింత బాధ్యతాయుతంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జరిమానాల వసూలులో కూడా ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఒకరు మ్యాచ్ను అద్భుతంగా ముగించగలడు, మరొకరు అద్భుతంగా ప్రారంభించగలడు వారు ఎవ‌రో తెలుసా.... ఒకరు మ్యాచ్ను అద్భుతంగా ముగించగలడు, మరొకరు అద్భుతంగా ప్రారంభించగలడు వారు ఎవ‌రో తెలుసా....
లోక‌ల్ గైడ్ : ఈరోజు రాత్రి 7:30 గంటలకు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది....
కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి
పుష్కరాల్లో సరస్వతి నవరత్నమాల హారతి
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జరిమానాలు రూ.12 వేల కోట్లు!
మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ నోటీసులు
“మాకూ టైమ్ వస్తుంది... అప్పుడు చూపిస్తాం”: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు – కొత్త ఆటగాళ్లకు అవకాశాలు