హైదరాబాద్‌లో ధరల తాకిడి

 హైదరాబాద్‌లో ధరల తాకిడి

ఇటివల తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడ్డాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా ధరలు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9% స్వచ్ఛత) బంగారం ధర 10 గ్రాములకు ₹1,910 పెరిగి ₹98,450కి చేరింది. అఖిల భారత సరఫా అసోసియేషన్ తాజా గణాంకాల ప్రకారం ఇది నమోదైన ధర.

మదుపరులు మళ్లీ పసిడిపై ఆసక్తి చూపడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వల్ల ఈ ధోరణి కొనసాగుతుందన్నది నిపుణుల అభిప్రాయం. హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి:

  • 24 క్యారెట్‌ బంగారం తులం ధర ₹2,400 పెరిగి ₹97,420కి చేరింది.

  • 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాములకు ₹2,200 పెరిగి ₹89,300గా నమోదైంది.

  • వెండి ధర ఢిల్లీలో కిలోకి ₹1,660 పెరిగి ₹99,160కి చేరింది.

పెండ్లిళ్ల సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడం వల్ల బంగారం, వెండి లాంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరిగిందని బులియన్‌ వ్యాపారవర్గాలు అంటున్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు