రైల్వే స్టేష‌న్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.....

 రైల్వే స్టేష‌న్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.....

లోక‌ల్ గైడ్ :
బికనీర్ / రాజస్థాన్: రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ్‌నోక్ రైల్వే స్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రధాని మోదీ బికనీర్‌లోని ప్రసిద్ధ కర్ణిమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ప్రధాని బికనీర్ ఎయిర్ బేస్‌ను కూడా పరిశీలించారు.పర్యటన చివరగా బికనీర్ సమీపంలోని పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇక, ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని అనుసరిస్తూ భారత ప్రభుత్వం ప్రారంభించిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందారు.ఈ ఉగ్రదాడికి నెల రోజులకే ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని బికనీర్ ఎయిర్ బేస్‌ను సందర్శించడం విశేషం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు
లోక‌ల్ గైడ్ :భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంగ్లాండ్ పర్యటన కోసం అండర్-19 జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటన జూన్ 24 నుంచి జూలై...
వర్షాకాలంలో తలెత్తే సమస్యలకు నిర్మల్ పోలీస్ శాఖ సన్నద్ధత. 
రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.
రాబోయే స్థానిక సంస్థల  గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరు కలిసికట్టుగా పనిచేయాలి
టెస్ట్ జట్టుగా చరిత్రలో దిగజారిన బంగ్లాదేశ్
ఉగ్ర‌వాదులు భార‌త్ లోకి చొర‌బడేందుకు య‌త్నం....
'డ్రాగన్' చిత్రంలో కీలక పాత్రలో విద్యాబాలన్ – మరోసారి నందమూరి కుటుంబంతో జత