ఆరుద్ర పురుగులు ఎప్పుడైనా చూసారా......
By Ram Reddy
On
తెలంగాణ రైతుల శుభ సూచకం
లోకల్ గైడ్:
ఆరుద్ర పురుగులు లేదా రెడ్ వెల్వెట్ మైట్స్ను తెలంగాణ రైతులు శుభ సూచకంగా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా జూన్ నెలలో ఆరుద్ర కార్తె సమయంలో, తొలకరి వర్షాల తరువాత కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది మే నెలలోనే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఈ పురుగులు ప్రత్యక్షమవడం విశేషం. ఇది వాతావరణం చల్లబడటం, అలాగే ఇటీవల కురిసిన వర్షాల ప్రభావం అని భావిస్తున్నారు.రైతులు ఈ పురుగులను వర్షాభివృద్ధికి, పంటల పెరుగుదలకు సంకేతంగా భావిస్తారు. ఆరుద్ర పురుగులు పొలాల్లోని హానికరమైన పురుగుల లార్వాలను తిని పంటలను రక్షిస్తాయి. ఇవి మానవులకు హానికరం కావు. ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే కనిపించే ఈ పురుగులు రైతులకు బాగుండే కాలానికి సంకేతంగా కనిపించి, ఆశాభావాన్ని కలిగిస్తాయి.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
31 May 2025 15:34:28
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
Comment List