ఆరుద్ర పురుగులు ఎప్పుడైనా చూసారా......

ఆరుద్ర పురుగులు ఎప్పుడైనా చూసారా......

తెలంగాణ రైతుల శుభ సూచకం

లోక‌ల్ గైడ్: 
ఆరుద్ర పురుగులు లేదా రెడ్ వెల్వెట్ మైట్స్‌ను తెలంగాణ రైతులు శుభ సూచకంగా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా జూన్ నెలలో ఆరుద్ర కార్తె సమయంలో, తొలకరి వర్షాల తరువాత కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది మే నెలలోనే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఈ పురుగులు ప్రత్యక్షమవడం విశేషం. ఇది వాతావరణం చల్లబడటం, అలాగే ఇటీవల కురిసిన వర్షాల ప్రభావం అని భావిస్తున్నారు.రైతులు ఈ పురుగులను వర్షాభివృద్ధికి, పంటల పెరుగుదలకు సంకేతంగా భావిస్తారు. ఆరుద్ర పురుగులు పొలాల్లోని హానికరమైన పురుగుల లార్వాలను తిని పంటలను రక్షిస్తాయి. ఇవి మానవులకు హానికరం కావు. ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే కనిపించే ఈ పురుగులు రైతులకు బాగుండే కాలానికి సంకేతంగా కనిపించి, ఆశాభావాన్ని కలిగిస్తాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........