బీజేపీ నాయకుల ర్యాలీ 

బీజేపీ నాయకుల ర్యాలీ 

గద్వాల, లోకల్ గైడ్:
రాజమత అహల్య బాయి హోల్కర్ 300 వ జయంతి ఉత్సవాల సందర్బంగా శనివారం గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా నుండి వైఎస్సార్ చౌక్ వరకు బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు హాజరై మాట్లాడుతూ..అహల్యా బాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారని తెలిపారు. ఆమె తన పాలన కాలంలో అనేక హిందూ ధర్మ కార్యకలాపాలు అద్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. యుధ్ధ విద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక ప్రత్యేక మహిళా సేనను ఏర్పరిచారన్నారు. తన పాలన సమయంలో అహల్యా బాయి ప్రజా సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారని తెలిపారు. భారతదేశ సంస్కృతి ధర్మ పరిరక్షణ కోసం వీరు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం వీరి పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, పోగ్రాం కో-కన్వినర్స్ అక్కల రమాదేవి, శోభారాణినరేష్ గౌడ్, బలిగేర శివారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ , కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లెం దొడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేవా దాస్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్, ఓబీసీ మోర్చా కార్య వర్గ సభ్యుడు అనిల్, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, తిరుపతి రెడ్డి, నాగరాజు, నాగయ్య, మహిళ మోర్చా నాయకురాలు భారతి,  వెంకటమ్మా, బిజెపి నాయకులు వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరైయ్యారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........