వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
వర్షాలకు ముందే ధాన్యం తరలింపు పూర్తి చేయండి
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ :
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండలంలోని కల్వకోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పి అమరేందర్ తో కలిసి రైతుల నుండి సేకరిస్తున్న వరి కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్ లు అందుబాటులో ఉన్నాయని, వర్షానికి వడ్లు తడిచిపోకుండా కప్పి ఉంచాలని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ..... లారీల కొరత లేదని, తేమ శాతం 17 వరకు ఉన్నా వెంటనే తూకం వేసి లారీల్లో ఎక్కించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. హమాలిల కొరత లేకుండా చూసుకోవాలని ధాన్యం తరలింపు వేగంగా జరగాలని సూచించారు. కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుండి తరలించేందుకు ఒకేరోజు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచి తరలించాలని, అవసరమైతే ఇంకొన్ని లారీలు సమకూర్చుతామని రైతులకు భరోసా కల్పించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి ముందుగా రావడం వల్ల రైతులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ వాతావరణ మార్పు కు అనుగుణంగా రైతులు సైతం పంట కోతలు త్వరగా ప్రారంభించి కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసే వరకు వడ్లు తడిచిపోకుండా టార్పాలిన్ లు కప్పి ఉంచాలని రైతులను సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, డిఎం సివిల్ సప్లై రాజేందర్, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, పెద్దకొత్తపల్లి తహసిల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ తదితర శాఖల అధికారులు తదితరులు ఉన్నారు
Comment List