పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 

ప్రపంచ పొగాకు వ్యతిరేక అవగాహన ర్యాలీ 

పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 

జిల్లా వైద్య , ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ కె.వి స్వరాజ్యలక్ష్మి

లోకల్ గైడ్, నాగర్ కర్నూల్ జిల్లా
, శనివారము జిల్లా పరిషత్ కార్యాలయ (పాత కలెక్టరేట్) ప్రాంగణం ఆవరణ లో  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వి స్వరాజ్యలక్ష్మి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఎం. హెచ్. ఒ.స్వరాజ్యా లక్ష్మి వైద్య సిబ్బంది అందరిచే పొగాకు ఉత్పత్తులు వినియోగించనని, మరియు స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులందరికీ పొగాకు ఉత్పత్తులు వినియోగించకుండా అవగాహన కలిగిస్తానని, పొగాకు ఉత్పత్తుల వాడకం నుండి పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైని, తంబాకు, జర్దా  తదితర ఉత్పత్తులను వినియోగించడం వలన శరీరంలో రక్తనాళాలు, మెదడు, గుండె , జీర్ణ వ్యవస్థ తదితర అవయవాలపై ప్రియమైన దుష్ప్రభావం కలుగుతుంది. ముఖ్యంగా కామారదశలో స్నేహితులు , సహచరులు, పరిసరాల ప్రభావం వల్ల సరదాగా ప్రారంభమై, వ్యసనంగా మారుతుంది. కావున విద్యార్థి దశలోనే పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభాల గురించి అవగాహన కలిగించాలని ,ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలలో  వైద్య మరియు ఆరోగ్య సిబ్బంది  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కోట్ఫా యాక్ట్ 2003 ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయరాదని, 18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు, పాఠశాలల  పరిధిలో 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తిలో అమ్మడం నిషేధం . పొగాకు ఉత్పత్తిలో వినియోగించడం మానాలనుకునేవారు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  సైకియాట్రిస్ట్ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్, టీకా కరణ అధికారి డాక్టర్ రవి కుమార్ , పెద్ద ముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వాణి, ఇన్ సిడి నోడల్ పర్సన్ విజయ్ కుమార్, మల్లేష్, ఎం ఎల్ హెచ్ పి లు నీరజ్, పర్యవేక్షణ సిబ్బంది ఆర్ శ్రీనివాసులు, రాజేష్, వై శ్రీనివాసులు, ఫసిఒద్దీన్, జ్యోతి, జిల్లా ఫార్మసీ ఆఫీసర్ సురేష్, డివి ఎల్ఎం కుమార్, ఆరోగ్య కార్యకర్తలు, ఏ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........