జననీయాత్రను సద్వినియోగం చేసుకోవాలి.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి.

జననీయాత్రను సద్వినియోగం చేసుకోవాలి.

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి జననీ యాత్ర ప్రారంభం

నల్లగొండ, లోకల్ గైడ్

 పిల్లలు లేని దంపతులకు అధునాతన సంతాన సౌకర్య పరిష్కారాల కోసం ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో నల్లగొండలో జననీ యాత్ర చేపట్టడం అభినందనీయమని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఖయ్యూం బేగ్ తో కలిసి జననీ యాత్రను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలు కాని దంపతులు ఆర్.ఎం.పి కలవడం, ఆ తర్వాత  మందులు వాడుతున్నారని పేర్కొన్నారు.
మనకు ఉన్న సమస్యలు లోపం కాదని, ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.పిల్లలు పుట్టని దంపతులను బయటి వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా వేధిస్తారని, అవమాన పరుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపాన్ని గుర్తించి నీ కలలను సహకారం చేసుకోవచ్చని సూచించారు. పిల్లలు పుట్టక పోతే విడిపోయిన దంపతులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. అమ్మానాన్నలవ్వాలని ఆశ దిశగా పిల్లలు పుట్టనీ దంపతుల కోసం నల్లగొండలో జననీ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. పేదవారికి అతి తక్కువ ఫీజుతో వారి కళలను సహకారం చేయాలని కోరారు. 

నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు ఎంతో మానసిక వేదనకు గురవుతారని పేర్కొన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇలాంటి వారికోసం ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో జననీ యాత్ర చేపట్టడం హర్షనీయమన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News