ఈ విజయానికి వారు ఇద్దరూ అర్హులే… విరాట్ కోహ్లీ  

ఈ విజయానికి వారు ఇద్దరూ అర్హులే… విరాట్ కోహ్లీ  

లోక‌ల్ గైడ్ :
ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ తొలి సారిగా ఐపీఎల్ ట్రోఫీని ఎత్తుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ కన్నీళ్లకు అడుగునపడ్డాడు.ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌చేసి 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. పంజాబ్‌కు మంచి ఆరంభం లభించినా, ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా రాణించారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా అద్భుతంగా బంతులేసి పంజాబ్‌ను కష్టాల్లో నెట్టాడు. అయినా శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులతో పోరాడాడు. కానీ విజయం మాత్రం ఆర్సీబీదైంది.ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ – “ఈ విజయం RCB అభిమానులకు అంకితం. నేను నా యువస్థితి మొత్తం ఈ జట్టుకే సమర్పించాను. అనుభవాన్ని, విధేయతను కూడా ఇవ్వగలిగాను. నా మనసు, ఆత్మ రెండూ బెంగళూరుతోనే ఉన్నాయి. నేను ఎప్పటికీ ఈ జట్టుకే నిబద్ధుడిని. వారి మద్దతు నాకు ఎంతో బలాన్నిచ్చింది,” అని భావోద్వేగంతో చెప్పారు.విజయంలో తనతో కలిసి ఎన్నో ఏళ్ల పాటు RCB తరఫున పోటీ పడ్డ AB డివిలియర్స్, క్రిస్ గేల్‌ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “ఈ విజయానికి వారు ఇద్దరూ అర్హులు. వారిద్దరూ మా జట్టుకి ఎంతో సేవ చేశారు. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే ABతో ఈ గెలుపు సంబరాలు పంచుకుందామని అన్నాను,” అన్నారు విరాట్.అలాగే, "నా ఆటగాడిగా లక్ష్యం ఎప్పుడూ 20 ఓవర్లు మైదానంలో ఉండి ప్రభావం చూపించడమే. ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాదు. జట్టులో ఎంతో మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఈ క్షణం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది,” అంటూ భావోద్వేగంగా చెప్పాడు.అంతేకాకుండా, “నా కెరీర్‌లో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పటికీ నాకు టెస్టు క్రికెట్ అంటేనే ప్రత్యేకమైన గౌరవం ఉంది. యువ క్రికెటర్లు కూడా ఈ ఫార్మాట్‌కి అదే స్థాయిలో గౌరవం ఇవ్వాలి” అని సూచించాడు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News