సమస్యల పరిష్కారం కొరకే భూభారతి చట్టం

ఏఎంసి చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి, తాసిల్దార్ సాంబశివుడు

సమస్యల పరిష్కారం కొరకే భూభారతి చట్టం

సత్తుపల్లి, లోకల్ గైడ్: 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం రైతుల, భూమి యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకొచ్చారని ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్ అన్నారు . భూభారతి చట్టం పై రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుండి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం కల్లూరు రైతు వేదికలో తాసిల్దార్ పులి సాంబశివుడు అధ్యక్షతన ఏర్పాటుచేసిన రెవిన్యూ సదస్సు లో ఏం సి చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి  పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  రెవెన్యూ సదస్సులలో రైతులు వద్ద నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తారని తెలిపారు. నదస్సులు అనంతరం ఆన్ లైన్ లో పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 అక్టోబర్ ముందు సాదా బై నామలో దరఖాస్తులు చేసుకున్న వాటిని పరిశీలిస్తున్నట్లు ,ఈ సమస్యలు సాధనకు రెవెన్యూ సదస్సులు అనంతరం పరిష్కార మార్గాలు చూపిస్తామని పేర్కొన్నారు. రైతుల సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే నేరుగా రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించవచ్చనిఆమె తెలిపారు. కల్లూరు రెవెన్యూ పరిధి నుండి అధిక సంఖ్యలో రైతులు పాల్గొని దరఖాస్తులు సమర్పించారు .ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News