గో సంరక్షణ చట్టాలు అమలు చేయాలి, గోవులను రక్షించాలి"

జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం, నిరసన.

గో సంరక్షణ చట్టాలు అమలు చేయాలి, గోవులను రక్షించాలి

జనగామ (లోకల్ గైడ్):-గోవులను గోవంశాలను రక్షించడం  మనందరి భాద్యత అని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి డా.మోహనకృష్ణ భార్గవ అన్నారు. గురువారం ఉదయం విశ్వాహిందూ పరిషత్ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు, అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ గోవు సకల దేవతా స్వరూపమని, గోవంశాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. విచ్చలవిడిగా గోవులు, ఎద్దులు, దూడలను అక్రమంగా రవాణా చేస్తూ కభేళాలకు తరలించి వధిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో గోవుల రక్తం ఏరులై పారుతున్నప్పటీ ప్రభుత్వం గో సంరక్షణ చట్టాలను అమలు చేయడం లేదని, గోరక్షకులపై నిరంతరం దాడులు జరుగుతున్నప్పటికీ పోలీస్ యంత్రాంగం సైతం నిమ్మకు నీరెత్తనట్లుగా చూసిచూడనట్లుగా వదిలేస్తున్నారని అన్నారు.
గోవులు హిందువులకే కాదు యావత్ సమాజానికి అవసరం అని వ్యవసాయ ఆధారితంగా, పాడిపశువుల ఆధారితంగా జీవించే మనందరం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు, పాలిచ్చే గోవులను, పాడి పశువులను, దూడలను అతి కిరాతకంగా వధిస్తుంటే స్పందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గోవంశ రక్షణా చట్టాలను అమలు చేయాలని, జనగామ జిల్లాలో గోశాల ఏర్పాటు చేయాలని, గోరక్షణా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, గోవులు పశువుల అక్రమ రవాణా అరికట్టే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని పదకొండు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు. కలెక్టర్ అందుబాటులో లేనందున కార్యాలయంలోని సూపరింటెండెంట్ కి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, దుర్గావాహిని, భజరంగ్ దళ్ సభ్యులు పాశం శ్రీశైలం, అంబటి బాలరాజు, చిలువేరు హర్షవర్ధన్, జాన్సీ, బచ్చు బాలనారాయణ, కుందారపు బైరునాథ్, చిక్కుడు నగేష్, సుంచు శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, వేణుగోపాల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News