పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యం...
వర్దన్నపేట(లోకల్ గైడ్): సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఒక వరంగా మారిందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. నేడు హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయం నందు వర్ధన్నపేట టౌన్ 2వ వార్డుకి చెందిన వడ్లకొండ సాయి చరణ్ లివర్ సమస్య తో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి 45 లక్షల ఖర్చు చేసిన కూడ మరణించగా ఆ సమాచారం తెలియగానే ఎమ్మెల్యే నాగరాజు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో మొదటి సారిగా గొప్ప ఆలోచనతో ఏకంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 6 లక్షల రూపాయల మంజూరు చేయగా నేడు ఆ చెక్కును లబ్ధిదారునికి ఎమ్మెల్యే నాగరాజు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి అర్హులందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే నాగరాజు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, కాంగ్రెస్ నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, కిషోర్, టౌన్ మాజీ కౌన్సిలర్లు సమ్మేట్ట సుధీర్, మంచాల రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List