పెద్దేముల్ ఎస్సైగా ప్రశాంత్ వర్ధన్.
లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్ మండల ఎస్సైగా ప్రశాంత్ వర్ధన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వర్తించిన శ్రీధర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా హత్నురా పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్ళారా.దీంతో టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న శ్రీకాంత్ వర్ధన్ ను సుమారు 15 రోజుల తర్వాత పెద్దేముల్ ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు పెద్దేముల్ ఎస్సైగా ప్రశాంత్ వర్దన్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఎవరైనా అసాంఘీక కార్యక్రమాలు,అక్రమ రవాణా, పేకాట, వివిధ రకాల అసాంఘిక చర్యలకు పాల్పడితే.... చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఏమైనా అవాంచనీయ సంఘటనలు జరిగినట్లు తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
Comment List