దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.
- అరెస్టు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తాం.
- పోలీసుల తీరును నిరసిస్తూ నేడు చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
- సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్.
లోకల్ గైడ్/ తాండూర్:
దళితులను కులం పేరుతో దూషించడమే కాకుండా, దాడులకు పాల్పడిన దుర్మార్గులను వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలను తెలియజేశారు. ఈ క్రమంలో నేడు పోలీసుల తీరును నిరసిస్తూ, తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి... డిఎస్పి కార్యాలయం వరకు చేపట్టబోయే ర్యాలీని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నుంచి దళిత సంఘాల నాయకులు, యువకులు, ప్రతి ఒక్కరు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని,బాధితులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత నెల 18న బెల్కటూరు గ్రామంలో వినయ్ కుమార్ అనే యువకుడి పెళ్లి ఊరేగింపులో,అదే గ్రామానికి చెందిన కొంతమంది...ఇతర సామాజిక వర్గానికి చెందిన యువకులు,దళితులను కులం పేరుతో దూషించడమే కాకుండా, వాళ్లపైన దాడులు చేశారని ఆయన తెలిపారు.సుమారు 20 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు పోలీసులు... దాడులకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా ఉండటాన్ని నిరసిస్తూ.... నేడు డిఎస్పి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ధర్నా కార్యక్రమంలో పాల్గొని బాధితులకు అండగా నిలబడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు, బాధిత యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List