మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న మోదీ ప్రభుత్వం..

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న మోదీ ప్రభుత్వం..

 బిజెపి  దోమ మండల ప్రధాన కార్యదర్శి దోమ నర్సిములు

లోకల్ గైడ్ తెలంగాణ దోమ 

 వికారాబాద్ జిల్లా దోమ మండల బిజెపి  ప్రధాన కార్యదర్శి దోమ నర్సింలు శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ లోనే మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయడం ఒక మోడీ ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసేది పేద ప్రజల ఆకలి తీర్చే కేంద్ర ప్రభుత్వమే పేద ప్రజలకు ఇబ్బంది కలుగకూడదని రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మూడు నెలలకు ఒకేసారి సరిపడే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ఈ ప్రభుత్వానికి  మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వర్షాలు వరదలు వచ్చే అవకాశలు ఉన్నందున బియ్యం రవాణా శాఖలో  ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండడంతో జూన్, జూలై, ఆగష్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం కోటను మాసంలోనే పేదలకు జూన్ 1 నుండి 30 వ తేదీ వరకు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలోని చిట్ట చివరి గ్రామాన్ని సైతం అభివృద్ధి చేసేదే పేద ప్రజల ఆకలి తీర్చే మోడీ కేంద్ర ప్రభుత్వమే అని చెప్పుకున్నారు. రేషన్ బియ్యం ఒకేసారి ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని రేషన్ కార్డులు కలిగిన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 బస్సుపాస్ ఛార్జీల పెంపు – కొత్త ధరలు ఇవే!  బస్సుపాస్ ఛార్జీల పెంపు – కొత్త ధరలు ఇవే!
తెలంగాణ ఆర్టీసీ బస్సుపాస్ ఛార్జీలను పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ప్ర‌భుత్వం ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది. తాజాగా అన్ని విభాగాల్లో టికెట్...
హఫీజ్ పేట్ డివిజన్ లో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిలో పిర్యాదు
నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
ఓల్డ్ ఏంఐజి బీసీ మహిళల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
అఖిల్ రిసెప్షన్‌లో మహేష్ బాబు టీషర్ట్ హైలైట్‌..! ధర తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న మోదీ ప్రభుత్వం..
దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.