కదిలిన రాజ్యాంగ రథం.. 

 ప్రతి అడుగు అద్భుతం..! 

కదిలిన రాజ్యాంగ రథం.. 

షాద్ నగర్ లో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు అడుగడుగున ఘన స్వాగతం.. 

జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమం సూపర్ సక్సెస్.. 

భారీ ర్యాలీతో ఈడెన్ గార్డెన్ కు కదిలిన కాంగ్రెస్ బృందం.. 

షాద్ నగర్ లో ఆద్యంతం ఆకట్టుకున్న కార్యక్రమం.. 

సామాజిక మాధ్యమాలు తెరిస్తే చాలు.. బాపుజీ పై అడ్డగోలు విమర్శలు.. పండిత్ నెహ్రూపై ఆరోపణలు.. చివరికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను వదలని ఫేక్ మీడియాలు.. ఇలాంటి దశలో అలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతమైంది. గత కొద్ది రోజులుగా గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుతూ బాపు ఆశయాలను గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఫేక్ మీడియా ద్వారా బిజెపి చేస్తున్న కుతంత్రాలను ప్రజలకు అర్థం చేసి చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి మరింత ఊపు తేవడంలో భాగంగా పట్టణంలోని ఈడెన్ గార్డెన్ లో ఇదే కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రావలసి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేదు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ నాయకులు అడుగడుగున స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్, కొత్తూరు, నందిగామ ప్రాంతాలలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. షాద్ నగర్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయనను భాజా భజంత్రీలు, బాణ సంచాల మధ్య ర్యాలీగా ఈడెన్ గార్డెన్ కు తీసుకువెళ్లారు. అంతకుముందు పట్టణ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తిస్థాయిలో విజయవంతం చేయడంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

 ప్రయోజనం చేకూరుతుందా..? 

నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో స్వాతంత్రం తెచ్చిన మహనీయులను కించపరుస్తున్న సామాజిక మాధ్యమాల పోస్టులు ఫేక్ వీడియోలు మన దేశాన్ని మనం చులకన చేసుకునేలా ఉన్నాయి. ఇది బిజెపి పనా, ఇంకెవరైనా చేస్తున్నారన్నది ఇక్కడ ప్రస్తుతం. కానీ విధానాలను విమర్శించకుండా వారి వ్యక్తిగత జీవితాలను విమర్శించడం, అందులో లేనివి జొప్పించడం విమర్శలకు దారితీస్తున్న అంశం. అయితే ఈ దుష్ప్రచారాలను తప్పని జనాలకు చాటి చెప్పే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం చాలావరకు విజయవంతం అయిందని చెప్పాలి. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా విషయాలు చెప్పారు. అలాగే కొత్తూరు మండలానికి చెందిన ముస్లిం మహిళ నుష్రత్ బేగం ప్రసంగం ఆకట్టుకుంది. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ త్యాగాలకు సవాల్ గా మారిన ఇలాంటి వాటిని గట్టిగా చేదించగలిగితేనే పార్టీకి ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుల ఉన్నతిని వారి గొప్పతనాన్ని కాపాడుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రజల అభిప్రాయపడుతున్నారు.

 బాపూది దేశభక్తి.. బిజెపి ఓ దుష్టశక్తి.. 

బిజెపిపై మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ధ్వజం..
దేశం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన బాపూజీది దేశభక్తి.. అలాంటి బాపూజీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్లను విమర్శించే భారతీయ జనతా పార్టీ దేశానికే ఓ దుష్టశక్తి అని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి అన్నారు. జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లపాటు దేశాన్ని ఏలిన భారతీయ జనతా పార్టీ నిరుపేద కోసం ఒక ఇంటిని కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. పదేళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చిందని, తిరిగి రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాకే ఇందిరమ్మ ఇల్లు మళ్లీ తెరపైకి వచ్చిందని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పైన, మహనీయుల పైన దుష్ప్రచారాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకుల కుటీల యత్నాలను తిప్పికొట్టే ఈ కార్యక్రమం గ్రామ గ్రామానికి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితిని అధిగమించి సమస్యను నివారించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరు బాధ్యతగా అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన