డబ్ల్యూటీసీ టోర్నీ: ఇండియాకు దక్కిన ప్రైజ్‌మనీ ఎంతంటే?

డబ్ల్యూటీసీ టోర్నీ: ఇండియాకు దక్కిన ప్రైజ్‌మనీ ఎంతంటే?

వ‌రల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు భారత జట్టు అర్హత సాధించకపోయినప్పటికీ, లీగ్‌లో మూడో స్థానం పొందినందుకు ప్రైజ్‌మనీగా రూ.12.33 కోట్లు (దాదాపు 1.48 మిలియన్ డాలర్లు) అందుకోనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య ఈరోజు లార్డ్స్‌లో ప్రారంభం కానుంది.డబ్ల్యూటీసీ విజేతలకు 3.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 30 కోట్లకు పైగా), రన్నరప్ జట్టుకు 2.1 మిలియన్ డాలర్లు (రూ. 17.5 కోట్లు దాటే) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే ప్రకటించింది.ఇరుజట్లు గత రెండు సంవత్సరాలుగా జరిగిన డబ్ల్యూటీసీ సైకిల్‌లో అగ్రస్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా 19 టెస్టుల్లో 13 విజయాలతో 69.44% పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా 67.54% పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.ఈ మ్యాచ్‌లో ప్యాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక తొలిసారి చాంపియన్‌గా నిలవాలనే ఆశతో టెంబ బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా పోటీలో దిగనుంది. 2023లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇండియాను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌  శతకం  ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ శతకం
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య వర్చస్పోర్ట్‌ (ICC World Test Championship) ఫైనల్‌ మ్యాచ్‌ లార్డ్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో సౌతాఫ్రికా ఓపెనర్‌ ఐడెన్‌...
జిల్లా కలెక్టర్ ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్...
రవికుమార్ యాదవ్ ను కలిసిన బీజేపీ శ్రేణులు 
రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం
మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్
రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు