డబ్ల్యూటీసీ టోర్నీ: ఇండియాకు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) ఫైనల్కు భారత జట్టు అర్హత సాధించకపోయినప్పటికీ, లీగ్లో మూడో స్థానం పొందినందుకు ప్రైజ్మనీగా రూ.12.33 కోట్లు (దాదాపు 1.48 మిలియన్ డాలర్లు) అందుకోనుంది. ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య ఈరోజు లార్డ్స్లో ప్రారంభం కానుంది.డబ్ల్యూటీసీ విజేతలకు 3.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 30 కోట్లకు పైగా), రన్నరప్ జట్టుకు 2.1 మిలియన్ డాలర్లు (రూ. 17.5 కోట్లు దాటే) ప్రైజ్మనీగా ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే ప్రకటించింది.ఇరుజట్లు గత రెండు సంవత్సరాలుగా జరిగిన డబ్ల్యూటీసీ సైకిల్లో అగ్రస్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా 19 టెస్టుల్లో 13 విజయాలతో 69.44% పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా 67.54% పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.ఈ మ్యాచ్లో ప్యాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా టైటిల్ను నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక తొలిసారి చాంపియన్గా నిలవాలనే ఆశతో టెంబ బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా పోటీలో దిగనుంది. 2023లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Comment List