కార్యకర్తలే నా బలం, బలగం.
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు.
లోకల్ గైడ్, మంచిర్యాల :
లక్షెట్టిపేట,: కార్యకర్తలే నా బలం, బలగం వారి కోసం నా రక్తం చివరి బొట్టు వరకు శ్రమిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు. సోమవారం పట్టణంలో నూతనంగా నిర్మించిన కళాశాల భవనం, ఆసుపత్రి భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... నాకు పదవులు డబ్బు ముఖ్యం కాదని కార్యకర్తల బాగోగులు చూడడమే నాకు ముఖ్యమని ఈ ప్రాంత అభివృద్ధి నా కళ అని కావున ఈ రెండింటి కోసమే నేను కృషి చేస్తానన్నారు. మంత్రి పదవిని ఆశించామని కానీ సమీకరణాల వలన తనకు దక్కలేదని అయినప్పటికీ తనకు ఎటువంటి అసంతృప్తి లేదని అధిష్టానం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. రెండు వారాలలో ఏదో ఒకటి తేలుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందంటే తానే కారణమని ఇందులో ఎటువంటి శషబిశలు లేవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తానున్నా లేకున్నా ఈ ప్రాంత అభివృద్ధి కార్యకర్తల బాగోగులు నాకు ముఖ్యమన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇంతకాలంగా పార్టీ అభివృద్ధికి కార్యకర్తల అభ్యున్నతికి కష్టపడ్డానని ఇకముందు కూడా అధిష్టానానికి నమ్మినబంటుగా ఉంటానని ఎటువంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోనని ఆయన హామీ ఇచ్చారు. అధిష్టానం తనకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందన్నారు. ఈ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందని ఈ ప్రాంత ప్రజలు ఎంతో కష్టాలు పడ్డారని గత పది సంవత్సరాలు పడిన కష్టాన్ని తాను పోగొట్టడానికి నిర్ణయించుకున్నానన్నారు. ప్రభుత్వ కళాశాల భవనం జూన్ 12 తారీఖున ప్రారంభిస్తానని మాటిస్తే తప్పేదే లేదని కరాకండిగా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సైతం త్వరలోనే ప్రారంభిస్తానని దీనితో ఈ ప్రాంత ప్రజలకు విద్యా వైద్యం సౌకర్యం మెరుగుపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కోట్నాక తిరుపతి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం డిసిసి ఉపాధ్యక్షుడు చింత అశోక్ మండల పార్టీ అధ్యక్షుడు పింగళి రమేష్ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆరిఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List