*మహబూబాబాద్ నియోజక వర్గానికి 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు. ; మురళీ నాయక్
మహబూబాబాద్ (లోకల్ గైడ్)
మహబూబాబాద్ నియోజక వర్గం లో మహబూబాబాద్ మున్సిపాలిటీలకు మరియు కొత్తగా ఏర్పడిన కెసముద్రం మున్సిపాలిటీల అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ,మరియు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నీ మహబూబాబాద్ ఎమ్మేల్యే డా"భూక్యా మురళి నాయక్ కలిసి అడిగ గా వెంటనే కేసముద్రం మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు,మహబూబాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.ప్రత్యెక నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిగారికి శాలువా కప్పి వారికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అంతేకాకుండా మహబూబాబాద్ చుట్టు ఔటర్ రింగ్ రోడ్డు కి కూడా ఎమ్మెల్యే అడగగా దానికి ముఖ్యమంత్రి మరియు వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించి దానిని కూడా అతిత్వరలో అనుమతులు ఇస్తానని తెలియజేశారని తెలిపారు.
Comment List