మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు
By Ram Reddy
On
హైదరాబాద్: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు హాజరు కావాలని సూచిస్తూ, ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే మే 26న హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని, తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ అప్పుడు సమాధానం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు తిరిగి విచారణకు హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు పంపింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 13:03:20
2024 జనవరిలో సినీ పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డులను రద్దు చేసి, బల్లాడీర్ గద్దర్ గారి పేరుతో ప్రతీ ఏటా ఆయన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డులను...
Comment List