డ‌బ్య్లూటిసి ఫైన‌ల్, ద‌క్షిణాఫ్రికా విజ‌య‌ల‌క్ష్యం ఎంతో తెలుసా.......

డ‌బ్య్లూటిసి ఫైన‌ల్, ద‌క్షిణాఫ్రికా విజ‌య‌ల‌క్ష్యం ఎంతో తెలుసా.......

 దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (ICC World Test Championship) ఫైనల్‌ మ్యాచ్‌ లార్డ్స్‌లో కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. మూడో రోజు ఆటలో మరో 63 పరుగులు జోడించి మొత్తంగా 207 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అలెక్స్‌ కేరీ 43, మిచెల్‌ స్టార్క్‌ 58 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 4, లుంగి ఎంగిడి 3, మార్కో యాన్సెన్‌, వియాన్‌ ముల్డర్‌, ఐడెన్‌ మార్క్రమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.మూడో రోజు ఆట ప్రారంభం కావడంతో పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా మారింది. అందువల్ల మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ఫలితం తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేసింది. దానికి ప్రత్యుత్తరంగా దక్షిణాఫ్రికా 138 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి 218 పరుగుల ఆధిక్యంలో 144/8 వద్ద నిలిచింది. మిచెల్‌ స్టార్క్‌ 16, నాథన్‌ లైయన్‌ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం
2024 జనవరిలో సినీ పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డులను రద్దు చేసి, బల్లాడీర్ గద్దర్ గారి పేరుతో ప్రతీ ఏటా ఆయన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డులను...
మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్
రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు
రాత్రి పూట భోజ‌నం అనంత‌రం 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఇన్ని లాభాల.....
ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 మ్యాచు!
కుమారుడి అడ్మీష‌న్ కోసం ఇక్రిశాట్‌కి వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌