కుమారుడి అడ్మీష‌న్ కోసం ఇక్రిశాట్‌కి వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

కుమారుడి అడ్మీష‌న్ కోసం ఇక్రిశాట్‌కి వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవా కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్న సంగతి తెలిసిందే. సింగపూర్‌లో చదువుకుంటున్న సమయంలో ఆయన చదివే పాఠశాలలో అగ్ని ప్రమాదం జరుగగా, మార్క్ కొంతవరకు గాయాల పాలయ్యాడు. సర్వం సవ్యంగా చికిత్స తర్వాత పవన్ కుమారుడిని హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్న మార్క్ ఇప్పుడు మళ్లీ స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో తన కుమారుడిని హైదరాబాద్‌లోనే చదివించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.అందులో భాగంగా పటాన్‌చేరు వద్ద ఉన్న ICRISAT లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌ను పవన్ కళ్యాణ్ ఇటీవల సందర్శించారు. కుమారుడి అడ్మిషన్ కోసం స్కూల్‌కి వెళ్లి అక్కడి టీచర్లతో సమావేశమై సిలబస్, సౌకర్యాలు, వసతులపై వివరంగా తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో మహేష్ బాబు పిల్లలు చదివినట్టు, అల్లు అర్జున్ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నట్టు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పవన్ వస్తున్న విషయాన్ని బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం కూడా జాగ్రత్తలు తీసుకుంది. మీడియాకు కూడా లోపలకి ప్రవేశం కల్పించలేదు.ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్‌లు పూర్తి చేసుకున్న పవన్, ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఉస్తాద్ భగత్ సింగ్ పై కేంద్రీకరించారు. హరిహర వీరమల్లు చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయాలని భావించినప్పటికీ, VFX పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. జూలైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మరోవైపు ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన