ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
--బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే.
▪️ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్...
గ్రేటర్ వరంగల్ (లోకల్ గైడ్):
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించి వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు విభాగాల వారిగా...
1.ఇంజనీరింగ్....16, 2.హెల్త్ & సానిటేషన్.....14, 3.ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)...07, 4.టౌన్ ప్లానింగ్...56, 5.మంచినీటి సరఫరా...06, మొత్తం =99 ఫిర్యాదు లు అందాయి.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి డి ఎఫ్ ఓ శంకర్ లింగం ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ హెచ్ ఓ లు రమేష్ లక్ష్మారెడ్డి డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి రాజేశ్వర్ ఏం హెచ్ ఓ డా.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List