ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ శుభవార్త

ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ శుభవార్త

 – ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 15 వరకు పెంపు

ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తూ, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది అసెస్‌మెంట్ ఇయర్ 2025-26కి సంబంధించిన గడువుగా, మొదట నిర్ణయించిన జూలై 31తో పోలిస్తే ఇది మరో నెలన్నర పొడగింపు అని తెలిపింది.ఈ నిర్ణయానికి కారణంగా, ఐటీఆర్ ఫారాల్లో మార్పులు చేయడం, నూతన యుటిలిటీ వ్యవస్థను అమలుపరచడం అవసరం కావడంతో సమయం కావాల్సి వచ్చిందని CBDT స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిటర్నులను దాఖలు చేయాలని ఉద్దేశించి ఈ గడువు పెంపు చర్య తీసుకున్నట్లు పేర్కొంది.ఈ నేపథ్యంలో CBDT పలు టెక్నాలజీ మార్పులు, మరియు ఐటీఆర్ ఫారాల రూపకల్పనలో కీలకమైన మార్పులు చేసింది. ముఖ్యంగా, రూ.50 లక్షల లోపు ఆదాయం కలిగిన వ్యక్తులు మరియు హిందూ అవిభాజిత కుటుంబాలు (HUF) ఇప్పుడు ఫామ్-1 లేదా ఫామ్-4 ద్వారా ఐటీఆర్ దాఖలు చేయవచ్చు.అలాగే, ఈక్విటీ మార్కెట్ల ద్వారా రూ.1.25 లక్షల లోపు దీర్ఘకాలిక మూలధన లాభాలు పొందిన సంస్థలు కూడా ఇప్పుడు అదే ఫారాల ద్వారా ఆదాయాన్ని ప్రకటించుకోవచ్చు. గతంలో అయితే ఇలాంటి ఆదాయాన్ని చూపించేందుకు ఐటీఆర్-2 వాడాల్సివుండేది.పన్ను చట్టాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా, 80C, 80GG వంటి డిడక్షన్ల సెక్షన్ల పరిధిలో కూడా పలు మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. సాధారణంగా, ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఐటీఆర్ ఫారాలను నోటిఫై చేస్తారు. కానీ ఈసారి నూతన ఆదాయపు పన్ను విధానం ప్రవేశపెట్టడం వల్ల ఫారాల నోటిఫికేషన్ ఆలస్యం అయ్యిందని CBDT తెలిపింది.ఈ మార్పులతో పాటు ఐటీ ఫారాల రూపకల్పన మరింత సులభతరం, పారదర్శకత కలిగిన విధంగా ఉండేలా మార్పులు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం, సౌకర్యవంతంగా రిటర్నులు ఫైల్ చేయడం సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........