రిషభ్ పంత్ సెంచరీ మెరుపు – కానీ విజయం మాత్రం ఆర్సీబీకే
లోకల్ గైడ్ :
ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్లో రిషభ్ పంత్ అద్భుతంగా చెలరేగాడు. ఆర్సీబీతో జరిగిన ఈ పోరులో, లక్నో తరఫున బ్యాటింగ్కు దిగిన పంత్ కేవలం 54 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి తన స్ట్రోక్ ప్లేతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో పెద్దగా ఫామ్లో కనిపించని ఆయన, చివరి మ్యాచ్లో మాత్రం అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
సెంచరీ అనంతరం పంత్ తన బ్యాట్, హెల్మెట్ను పక్కన పడేసి గాలిలో పల్టీ కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు – అది ఒక జిమ్నాస్ట్ లా కనిపించింది. చివరకు, 61 బంతుల్లో 118 పరుగులు (11 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి నాటౌట్గా నిలిచాడు. మిచెల్ మార్ష్ కూడా 37 బంతుల్లో 67 పరుగులు చేస్తూ రాణించాడు. వీరి అద్భుత ఇన్నింగ్స్లతో లక్నో 20 ఓవర్లలో 227/3 పరుగుల భారీ స్కోరు చేసింది.అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ చక్కగా ఛేదించింది. 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకొని ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ విజయంలో జితేశ్ శర్మ 85 నాటౌట్, కోహ్లీ 54 పరుగులు చేసి మెరిశారు. పంత్ సెంచరీ చేసినా, విజయం మాత్రం లక్నోకు దక్కకపోవడం ఈ మ్యాచ్కు ప్రత్యేకతగా నిలిచింది.
Comment List