రిషభ్ పంత్ సెంచరీ మెరుపు – కానీ విజయం మాత్రం ఆర్సీబీకే

రిషభ్ పంత్ సెంచరీ మెరుపు – కానీ విజయం మాత్రం ఆర్సీబీకే

లోక‌ల్ గైడ్ :
ఐపీఎల్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ అద్భుతంగా చెలరేగాడు. ఆర్సీబీతో జరిగిన ఈ పోరులో, లక్నో తరఫున బ్యాటింగ్‌కు దిగిన పంత్‌ కేవలం 54 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి తన స్ట్రోక్ ప్లేతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో పెద్దగా ఫామ్‌లో కనిపించని ఆయన, చివరి మ్యాచ్‌లో మాత్రం అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
సెంచరీ అనంతరం పంత్‌ తన బ్యాట్‌, హెల్మెట్‌ను పక్కన పడేసి గాలిలో ప‌ల్టీ కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు – అది ఒక జిమ్నాస్ట్‌ లా కనిపించింది. చివరకు, 61 బంతుల్లో 118 పరుగులు (11 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్‌ కూడా 37 బంతుల్లో 67 పరుగులు చేస్తూ రాణించాడు. వీరి అద్భుత ఇన్నింగ్స్‌లతో లక్నో 20 ఓవర్లలో 227/3 పరుగుల భారీ స్కోరు చేసింది.అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ చక్కగా ఛేదించింది. 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకొని ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ విజయంలో జితేశ్ శర్మ 85 నాటౌట్, కోహ్లీ 54 పరుగులు చేసి మెరిశారు. పంత్ సెంచరీ చేసినా, విజయం మాత్రం లక్నోకు దక్కకపోవడం ఈ మ్యాచ్‌కు ప్రత్యేకతగా నిలిచింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........