లోకల్ గైడ్అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు మళ్లీ కార్యాచరణ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ను నూతన ఆర్థిక శక్తిగా మార్చేందుకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలపాలన్న దిశగా ముందుకు సాగుతున్నారు. భారతదేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుని, గ్లోబల్ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.
అంతర్జాతీయ కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశాలను పెంచుతూ, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ప్రణాళికలపై ఆయన దృష్టి పెట్టారు. విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి టెక్ పార్కులు, స్పెషల్ ఎకనామిక్ జోన్లు, మెగా పారిశ్రామిక కొరిడార్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
దాంతో పాటు, స్వదేశీ యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించడం చంద్రబాబు మరో ప్రధాన లక్ష్యం. స్టార్టప్లకు మద్దతుగా ప్రత్యేక విధానాలు రూపొందించి, టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలను వృద్ధి పథంలోకి తీసుకురావాలనే దిశగా చర్యలు చేపడుతున్నారు. "భారతదేశ అభివృద్ధికి యువతే శక్తి. వారికి అవకాశాలు కల్పిస్తే, దేశ ఆర్థికం మరింత బలోపేతమవుతుంది" అని ముఖ్యమంత్రి అన్నారు.
2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్న ‘విజన్ ఇండియా’కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను ముందుండే రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు తపన. అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ, పెట్టుబడులకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్ను మార్చే ప్రయత్నాల్లో ఆయన పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు.
Comment List