4న టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం
పోస్టర్ ఆవిష్కరించిన టీబీజీకేఎస్, బిఆర్ఎస్ నాయకులు
కొత్తగూడెం లోకల్ గైడ్) : ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీన టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సోమవారం ఈ మేరకు టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆ యూనియన్ నాయకులతోపాటు టిఆర్ఎస్ నాయకులు కూడా కలిసి పోస్టర్ను ఆవిష్కరించ. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఈనెల 4 ఉదయం 9 గంటలకు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాలుగో తారీఖు చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమ పోస్టర్ ను కాపు కృష్ణ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు , మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మచ్చా నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల మాజీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దిండిగల రాజేందర్, భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ రామకృష్ణ, మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ దామోదర్, జిల్లా పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కూసాన వీరభద్రం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, గడప రాజయ్య కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్, తుమ్మ శ్రీనివాస్ కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్, జాఫర్ హుస్సేన్ ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్, అశోక్ బ్రాంచ్ సెక్రటరీ, శివకుమార్ బ్రాంచ్ సెక్రటరీ, అశోక్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ, పిట్ సెక్రటరీ కుమార్, స్వామి, యూసుఫ్, తొగర రాజశేఖర్ , సూరిబాబు, అన్వర్ కాజా, కాజా భక్ష, మధుసూదన్ రావు,పూర్ణచంద్రరావు, సురేష్ అశోక్, బషీర్, రామ్ కుమార్, సురేందర్, దేవదానం, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Comment List