విద్యుత్ షాక్ తో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం
-రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వనంపల్లి..జైపాల్ రెడ్డి
By Ram Reddy
On
గండిపేట, (లోకల్ గైడ్ ): రాజేంద్రనగర్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ షాక్ తో గత సంవత్సరంలో మాలే తిమ్మారెడ్డి మరణించారు. తిమ్మారెడ్డి స్వస్థలం మునిమోక్షం గ్రామం హన్వాడ మండలం, మహబూబ్ నగర్ జిల్లా నుండి బతుకుదెరువు కోసం వెంకటేశ్వరనగర్, గంధంగూడ, గండిపేట్ మండలం, రంగారెడ్డి జిల్లాకు బతుకుదెరువు కోసం వలస వచి జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం 2024 జూన్ 7 న కూలి పనికి వెళ్లగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. అతనికి భార్య మాలే సుశీల ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. బుధవారం ప్రభుత్వ నుండి 4 లక్షల 50 వేల రూపాయలు రాజేంద్ర నగర్ సబ్ డివిజన్ ఏడిఈ సత్యనారాయణతో కలసి వనంపల్లి జైపాల్ రెడ్డి బాండు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిమ్మారెడ్డి కుటుంబం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jun 2025 17:40:11
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే
Comment List