రాజకీయ అవగాహన లేని సన్నాసులు..   ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ "వీరావేశ" ప్రసంగం 

 ఎవరూ శాశ్వతం కాదని తెలుసుకోండి   పదేళ్లు ఎవర్ని ఎలా ముంచారో నాకు అన్నీ తెలుసు 

రాజకీయ అవగాహన లేని సన్నాసులు..    ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

 పాపిరెడ్డి గూడ గ్రామంలో నూతన అంగన్వాడి కేంద్రం, వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే 

పొద్దున లేచినప్పటి నుండి కొందరు వెదవ సన్యాసులకు రాజకీయాలే 

తప్పుడు మాటలతో అవాకులు చావాకులు పేల్చితే జాగ్రత్త 

ఇలాంటి జ్ఞానం ఉండదు.. రాజకీయ అవగాహన అసలు ఉండదు.. పొద్దున లేవగానే కొందరు వెదవ సన్యాసులు రాజకీయాలు చేస్తుంటారని బాగా పనిచేసేవారిని టార్గెట్గా చేసుకొని అవాకులు చవాకులు మాట్లాడుతుంటారని అలాంటివారికి భయపడే ప్రసక్తే లేదని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. శనివారం కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రం మరియు వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాలను ఎమ్మెల్యే శంకర్ చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ "వీరావేశం"తో కొందరు గ్రామ నాయకులకు గడ్డి పెట్టారు. కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. వారి చేష్టలకు భయపడకూడదని గ్రామస్తులకు చెప్పారు. రాజకీయ అవగాహన లేని కొందరు వెధవ సన్యాసులు అవాకులు చవాకులు తమ గురించి మాట్లాడుతున్నారని ఎవరు ఏమిటో ఎక్కడెక్కడ ఏం చేశారు నాకు గ్రామ ప్రజలకు అన్నీ తెలుసని బిల్డింగ్ బ్లాక్ నుండి ఏం చేశారు..? భూముల విషయంలో ఏం చేశారు..? అన్ని తెలుసు అన్నారు. ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు. కొందరు రాజకీయ అవగాహన లేని సన్నాసులు మిడిమిడి జ్ఞానంతో అక్కడక్కడ మాట్లాడుతున్నారని వారి వికృత చేష్టలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ఇందిరమ్మ ఇండ్ల గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 
గత పదేళ్లు ప్రజలకు ఏ ఇల్లు ఇవ్వకుండా ఏం చేయకుండా ఎవరి పళ్ళు తోమారని ఎమ్మెల్యే శంకర్ ప్రశ్నించారు. గ్రామాల్లో గులాబీ కండువాలను వేసి దళిత బందు ఎవరికో ఇచ్చి ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుతుండడం సిగ్గుచేటు అన్నారు. ఇందిర మైండ్లు వాళ్లే ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని ముక్కు మొహం తెలియనోడు గుడి వెనక దండం పెట్టినట్టు ఆ నాయకుడు వ్యవహారం ఉందంటూ ఎమ్మెల్యే శంకర్ తన ప్రసంగం ద్వారా ఓ బిఆర్ఎస్ నాయకుడి తతంగాన్ని ఉతికి ఆరేశారు. ఇప్పుడు ఇచ్చే ఇండ్లు సరిపోకపోతే మరో 25 ఇండ్లు ఇస్తా కానీ మాట ఇచ్చి తప్పబోనని అన్నారు. గత పది సంవత్సరాలు గులాబీ నాయకులు ప్రజలకు ఏమీ ఒరగబెట్టకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన చూసి అక్కసు వెళ్ళగకుతున్నారని ధ్వజమెత్తారు. గ్రామంలో క్రీడలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని అవసరమైతే 100 టీములను పిలుచుకుని పెద్ద ఎత్తున చేసినా తాను అన్ని ఏర్పాట్లు చేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశం, మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి దంపతులు, శ్రీధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పటోళ్ల జగదీశ్వర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News