మళ్ళీ చురుకుగా నైరుతి రుతు పవనాలు..!

మళ్ళీ చురుకుగా నైరుతి రుతు పవనాలు..!

లోక‌ల్ గైడ్ :
నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరించనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే వీటి తీవ్రత మరింత పెరగబోతోందని హెచ్చరించారు.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 11న బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుండగా, జూన్ 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు వ్యవస్థలకు రుతుపవనాలు తోడవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
రుతుపవనాలు వేగంగా కదులుతుండటంతో దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తృత వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. కర్ణాటకలో జూన్ 12 నుంచి 15 వరకు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాయలసీమలో జూన్ 10 నుంచి 13 మధ్య కాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. జూన్ 12న తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. వర్ష భయంతో పలుచోట్ల రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News