మాల్దీవుల గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా క‌త్రినా కైఫ్

మాల్దీవుల గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా క‌త్రినా కైఫ్

పర్యాటకులకు మాల్దీవులు అందించే ఆనందం, ఉల్లాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీలిరంగు సముద్ర తీరాలు, ప్రశాంతతతో కూడిన వాతావరణం అక్కడి ఆకర్షణగా నిలుస్తుంది. చాలామందికి జీవితంలో ఒక్కసారి అయినా మాల్దీవులను సందర్శించాలని కోరిక ఉండగా, కొందరైతే ఆ కలను సాకారం చేసుకుంటున్నారు.ఇప్పుడు మాల్దీవులను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ విషయాన్ని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC) అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా స్పందించిన కత్రినా కైఫ్, “మాల్దీవులు సహజసిద్ధమైన అందాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానం. ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని అనుభవించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించేందుకు నా వంతు కృషి చేస్తాను,” అని పేర్కొన్నారు.ఇక మరోవైపు, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముఇజ్జు ఆహ్వానంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై నెలలో మాల్దీవులకు పర్యటనకు వెళ్ళే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఇది ముఇజ్జు అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మోదీ చేస్తున్న మొదటి అధికారిక పర్యటనగా ఉండవచ్చు.కత్రినా కైఫ్ అంబాసిడర్‌గా నియామకం, మోదీ పర్యటన అనే రెండు సంఘటనలు మాల్దీవులను గ్లోబల్ టూరిజం హబ్‌గా మరింత స్థిరంగా నిలిపే అవకాశముందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, గతంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు మాల్దీవుల పర్యటనలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నంలో భాగంగా కత్రినాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి *జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  మిడ్జిల్ (లోకల్ గైడ్): జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా
విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ ......
మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై విమానం కుప్పకూలిన దారుణ ఘటన
వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన
చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం