ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్
By Ram Reddy
On
నిర్మల్ : లోకల్ గైడ్ :
ఈవీఎంల భద్రతను పర్యవేక్షిస్తూ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.గోదాములో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ సమీక్షించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీస్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.ఈవీఎంల భద్రత, లాజిస్టిక్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరిపల్లి శ్రావణ్ రెడ్డి, సిరికొండ రమేష్, గండ్రత్ రమేష్, హైదర్, మజర్, ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు గజానంద్, ఈడిఎం నదీమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Jun 2025 15:16:09
-ధన్యవాదాలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి..జగదీశ్వర్ గౌడ్
Comment List