అర కొర బస్సులతో ప్రయాణికుల ఇబ్బందులు
*రోజుకు....రెండే ట్రిప్పులు...
*కలెక్టర్ కార్యాలయానికి అదనపు బస్సులు ఏవీ....?
మేడ్చల్ ,మల్కాజిగిరి: లోకల్ గైడ్:మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వెళ్ళేందుకు సరైన రీత ఆర్టీసీ బస్సులు లేక పోవడంతో జిల్లా పరిధిలోని మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ మున్సిపల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర కొర బస్సులు నడుపుతున్నా అవి ప్రయాణికుల రాకపోకలకు అనువుగా లేవు. ఉదయం ఒక ట్రిప్, సాయంత్రం మరొక ట్రిప్ మాత్రమే నడుస్తుండటం తో అర కొర బస్సులతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా దొంగల మైసమ్మ గుడి నుండి కలెక్టర్ ఆఫీస్ కు రావాలంటే నాలుగు కిలోమీటర్లు దూరం ఉంటుంది. సరైన రీతిలోబస్సులు లేక పోవడంతో దట్టమైన,భయంకరమైన చెట్ల మధ్యలో నడుచుకుంటూ తమ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తుందని పలువురు ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్లాలంటే ఆటోడ్రైవర్ లు అడిగినంత ముట్టచెప్పుకోవాల్సి వస్తుంది. అసలే అంతంత సంపాదన, ఆటో వాలాలకే రాను పోను రెండుసార్లు ఇస్తే తమ జేబులు ఖాళీ అవుతున్నాయ ని ప్రయాణికులు వాపోయా రు. ఇకనైనా ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి, అదనపు బస్సులను నడపాలని ప్రయాణీకులు కోరుతు న్నారు. అదే విధంగా కలెక్టర్ ఆఫీసులో నెట్ ప్రాబ్లం ఉండడంతో స్టాప్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి కలెక్టర్ స్పందించి, కార్యాలయంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Comment List