నూతనంగా నమోదైన విద్యార్థులు అందరూ రెగ్యులర్ గా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలి.
జిల్లా విద్యాధికారి. పి. రామారావు.
నిర్మల్ : లోకల్ గైడ్ :
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల నిలుపుదల కొరకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్మల్ మండలంలోని మంజులాపూర్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు సందర్శించి నూతనంగా నమోదైన విద్యార్థులు అందరూ రెగ్యులర్ గా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని మొత్తం 5+ పిల్లల సంఖ్య, పాఠశాలలో నమోదు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత ఏకరూప దుస్తులు , మధ్యాహ్న భోజన పథకం మొదలైన కార్యక్రమాలను అమలు పరచడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్య పటిష్టతకు చేస్తున్నటువంటి కృషిని వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదవడం ద్వారా విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి సాధించవచ్చు అని తెలియజేశారు.
ఈ సందర్భంగా కృత్యాధారితంగా అభ్యసింపజేయడాన్ని ఉపాధ్యాయురాలు పోల కావ్య చేసి చూపించగా సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆంగ్లములో ధారాళంగా చదవడం చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆంగ్ల ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త సామ రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయురాలు కవిత రాణి, జి. .సుధీర్, ఉమామహేశ్వర్ రెడ్డి పోల కావ్య లు పాల్గొన్నారు.
Comment List