జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి
-డీఈఓ రమేష్ కుమార్ కు టి యు డబ్ల్యూజే (హెచ్143) వినతి
లోకల్ గైడ్
నాగర్ కర్నూల్ జిల్లా లోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని కోరుతూ మంగళవారం డీఈఓ రమేష్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ప్రతి ఏడాది అందించే విధంగా ఈ ఏడాది కూడా ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా ప్రైవేట్ పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేయాలని కోరగా అందుకు స్పందించిన డిఇఓ సర్కులర్ జారీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటరమణ కు జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఉచిత విద్యతోపాటు రాయితీతో కూడిన విద్యను అందించే విధంగా సర్క్యులర్ జారీ చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్ 143) ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో టీయూడబ్ల్యూజే (హెచ్ 143) రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు ఖానాపురం ప్రదీప్, టీయూడబ్ల్యూజే హెచ్ 143 అనుబంధ సంఘం ఐజేయు జాతీయ నాయకులు జెమిని సురేష్, హౌదేకార్ ఉమా శంకర్, ఫోటో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కపిలవాయి రాజు లతోపాటు టియుడబ్ల్యూజే హెచ్143 తాలూకా మండల కమిటీల బాధ్యులు సభ్యులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comment List