గత ఏడాది కంటే ఐదు రెట్లు అధికంగా ధాన్యం దిగుబడికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు
•జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్ల, సేకరణ,రవాణా నిర్వహణపై నిమగ్నమై ఉంది..
•రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
--అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి.
మహబూబాబాద్ (లోకల్ గైడ్): శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ)కె.వీరబ్రహ్మచారి,"తొర్రూరు మండలం అమ్మాపురం, మాటేడు," దంతాలపల్లి మండలం "కుమ్మరికుంట్ల," "నరసింహలపేట మండల" కేంద్రాలలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అమ్మాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి కేంద్రాల నిర్వహకులు, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కేంద్రంలో కేవలం 200 మెట్రిక్ టన్నుల దాన్యం మాత్రమే కలదని,ఈ రోజుసాయంత్రంలోగా మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు.మాటేడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ట్రాక్టర్స్ ద్వారా రోడ్డుపైకి దానియాన్ని తరలించి లారీలలో లోడ్ చేయడం జరుగుతుందని, సాయంత్రంలోగా పూర్తిస్థాయిలో ఈ కేంద్రంలో దానియాన్ని తరలించడం జరుగుతుందన్నారు.కుమ్మరి కుంట్లలో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని లారీలకు షిఫ్ట్ చేయడం జరుగుతుందని అన్నారు. నరసింహపేట మండల కేంద్రంలో 200 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, రవాణాలో కొంత జాప్యం ఉన్నందున సంబంధిత కాంట్రాక్టర్లతో, రైస్ మిల్లర్లు,హమాలీలను తో సంబంధిత రైతులు ఆకుతోట రఘుపతి, బొమ్మ శెట్టి వెంకన్న, భూక్య సూక్య, తోట సురేష్, జాటోతు శ్రీను, తండబోయిన వెంకన్న లతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు వివరిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లారీలను సమకూర్చారు, ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం లోగా ఈ కేంద్రంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరుగుతుందని ఆయన వారితో చెప్పారు.ధాన్యం సేకరణ రవాణాపై అధికారులు తీసుకుంటున్న చర్యలను స్వయంగా చూసి రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం వర్షాలు పడే సూచన ఉన్నందున అందుకు తగిన విధంగా కేంద్రాల నిర్వహకులు రైతులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.పూర్తిస్థాయిలో జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారులు, యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లపై నిమగ్నమై ఉందని రైతులు ఎలాంటి భయాందోళనలకు చెందాల్సిన అవసరం లేదని అన్నారు.ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ లో సంప్రదించాలని ఆయన కోరారు.ధాన్యం కేంద్రాలలో టార్పాలిన్స్, గన్ని సంచులు, ప్యాడీ క్లీనర్స్, అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు, ఏలాంటి నిర్లక్ష్యం వహించిన సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు,ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి, సంబంధిత తాసిల్దారులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comment List