వేములవాడ కోడెదూడల మరణం..హిందువుల మనోభావాలకు తీరని గాయం..!

వేములవాడ కోడెదూడల మరణం..హిందువుల మనోభావాలకు తీరని గాయం..!

లోక‌ల్ గైడ్: 
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న దేవాలయంలో గోవులకు మరణ శాసనం రచిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. సామర్థ్యానికి మించి ఇరుకైన స్థలంలో వందలాది కోడెదూడలను కుక్కడంతో, తొక్కిసలాటకు గురై కోడెదూడలో చనిపోతున్న విషయం బాధాకరం  ఆలనా పాలన కరువైన కారణంగా కోడె దూడల మృత్యు ఘోష కొనసాగుతోంది. రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం, పార్ట్ టైం అసిస్టెంట్లు సరిగా పట్టించుకోకపోవడం కారణంగా.. నిరంతరం కోడెదూడలు చనిపోవడం అత్యంత హేయం.భక్తిశ్రద్ధలతో రాజరాజేశ్వర దేవుడికి కోడెదూడలను సమర్పిస్తున్న భక్తుల మనోభావాలను గాయపరిచేలా వ్యవహరించడం దుర్మార్గం. "అవి కేవలం కోడెదలు మాత్రమే కాదు.  హిందువుల విశ్వాసాలకు ప్రతీక" అనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి.రాజన్న ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ, గోశాల నిర్వహణ అత్యంత పేలవంగా ఉండటం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనం అని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తోంది. నిన్న ఒక్కరోజే దాదాపు 12 కోడె దూడలు చనిపోవడం చాలా విషాదకరం. ప్రతిరోజు రెండు, నాలుగు, మూడు.. ఈ విధంగా కోడె దూడలు చనిపోతుంటే, గుట్టుచప్పుడు కాకుండా వాటిని పూడ్చివేసి చేతులు దులుపుకోవడం అధికారుల వంతు అయింది. కానీ కోడెదూడలకు చికిత్స చేసి, వైద్యం అందించాల్సిన విషయంపై దృష్టి ఎవరు సారించకపోవడం బాధాకరమని, దానికి గల బాధ్యులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది.

విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి గోవులను కాపాడుతుంటే.. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా కోడెదూడలను చేతులారా చంపడం హృదయం కలిసి వేసే చర్య అని మండిపడింది. దాదాపు 100 ఎకరాల సువిశాల స్థలాన్ని ఏర్పాటు చేసి, గోశాల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ.. భక్తుల కోరిక మేరకు గోషాల నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులను కలిసి కోడే దూడల మరణాలకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం.. తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..
తొర్రూర్ (లోకల్ గైడ్)తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు  యశస్విని...
పెన్షన్లకు అర్హులైన వారి దరఖాస్తులు స్వీకరించాలి
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి 
రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత కంటి వైద్య శిబిరం - 300 మందికి కంటి పరీక్షలు 
పేదవారి ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.
4న టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం