పెన్షన్లకు అర్హులైన వారి దరఖాస్తులు స్వీకరించాలి
జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్
By Ram Reddy
On
వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రైతు ఆత్మహత్య కుటుంబాలు మరియు వితంతు పెన్షన్ ప్రతిపాదనలు తదితర అంశాలపై సెర్ఫ్ సీఈవో దివ్య రంగరాజన్ జిల్లా అదనపు కలెక్టర్ లు, డిఆర్డిఓ, రెవెన్యూ భాగాల సంబంధించిన అధికారులతో జూమ్ సమావేశం ద్వారా సూచనలు సలహాలు ఇచ్చారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఆర్థిక సహాయం పొందే విధంగా దరఖాస్తుల స్వీకరించి ప్రతిపాదన రూపొందించాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం నుండి పెన్షన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జూమ్ సమావేశంలో కలెక్టరేట్ నుండి డి, హెచ్ సూపరింటెండెంట్ లు వెంకటేశ్వరి, నేమత్ అలీ,ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ మహమూద్ అలీ, డిపిఎం నర్సింలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jun 2025 13:11:38
లోకల్ గైడ్: సంక్రాంతి పండుగకు టాలీవుడ్లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ వసూళ్లు రాబట్టే...
Comment List