గత కెసిఆర్ ప్రభుత్వ ఆలోచన అమలయ్యేనా..?

గత కెసిఆర్ ప్రభుత్వ ఆలోచన అమలయ్యేనా..?

 అంకారప్రాయంగా రైతు వేదికలు 

  పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా వేదికలు

 రూ.. కోట్ల  నిధులు వృధా 

 అయోమయంలో అన్నదాతలు 

 లోకల్ గైడ్ మెదక్

రైతు సమస్యల పరిష్కారానికి వేదికలుగా గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికలు నేడు అలంకారప్రాయంగా మారాయి. రైతులకు వ్యవసాయశాఖ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో రైతు వేదికలను ఏర్పాటు చేశారు. వ్యవసాయానికి సంబంధించి సాగు, పంటల విక్రయాలు తదితర అంశాలను చర్చించుకునేందుకు అధికారులతో కలిసి రైతు వేదికలను పంచుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు రైతు వేదికలు రైతులకు ఎలాంటి ప్రయోజనకరంగా లేకుండా పోయాయి. కేవలం కొందరు నాయకులకు అడ్డాలుగా మారిపోయాయి. విందులకు వేదికలుగా మార్చుకున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో నిరుపయోగంగా ఉన్న రైతు వేదికలను ప్రయోజనంలోకి తీసుకురావాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అంతలోనే ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.     రైతు సమస్యల పరిష్కారానికి వేదికలుగా గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. కోట్లాది రూపాయల నిధులు వెచ్చింది. క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికలు నేడు అలంకారప్రాయంగా మారాయి. రైతులకు వ్యవసాయశాఖ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో రైతు వేదికలను ఏర్పాటు చేశారు. వ్యవసాయానికి సంబంధించి సాగు, పంటల విక్రయాలు తదితర అంశాలను చర్చించుకునేందుకు అధికారులతో కలిసి రైతు వేదికలను పంచుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు రైతు వేదికలు రైతులకు ఎలాంటి ప్రయోజనకరంగా లేకుండా పోయాయి. కేవలం కొందరు నాయకులకు అడ్డాలుగా మారిపోయాయి. విందులకు వేదికలుగా మార్చుకున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో నిరుపయోగంగా ఉన్న రైతు వేదికలను ప్రయోజనంలోకి తీసుకురావాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అంతలోనే ప్రభుత్వం మారింది. బిఆర్ఎస్ ప్రభుత్వ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. వాస్తవానికి సాగులో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే విధంగా భిన్నమైన పంటల సాగు, సాగులో మెలకువలు, భూసార పరీక్షలు, ఎరువుల వినియోగం, విత్తనాలు తదితర వాటిపై పూర్తి అవగాహన కల్పించాలన్న లక్ష్యంగా రైతు వేదికల నిర్మాణం చేపట్టారు. కానీ మెదక్  జిల్లాలో అక్కడక్కడ మినహా రైతు వేదికలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలో రైతు వేదికలను కనీసం ఎరుపుల
రైతు వేదిక విక్రయ కేంద్రాలుగా మార్చి రైతులకు అందుబాటులోకి తేవాలని కేసీఆర్ ఆలోచన చేశారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రక్రియ ఆటకెక్కింది. కస్టర్ల వారిగా నిర్మించిన రైతు వేదికల ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టేందుకు అవకాశం ఉంది. వ్యవసాయ శాఖలో సరిపడేంత సిబ్బంది, అధికారులు లేకపోవడం కూడా రైతు వేదికలు నిరుపయోగంగా మారడానికి ఓ కారణమైనది. ... 

ఎరువుల విక్రయాలు ఈసారైనా జరిగేనా?

 మెదక్  జిల్లా వ్యాప్తంగా 76  రైతు వేదికలు ఉన్నాయి. రైతు వేదికలు నిర్మించి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు దాటింది. రెండేళ్ల క్రితం ఖరీఫ్ సీజన్ లో రైతు వేదికల ద్వారా ఎరువుల విక్రయాలు చేపట్టాల్సి ఉండగా, ఆరంభం కాలేదు. ఈసారి అరంభిస్తారని రైతాంగం భావిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కు
మరో 25 రోజుల సమయం ఉంది. ఇప్పటి నుంచి ఆచరణలో పెట్టినా... ఖరీఫ్ సీజన్ ఎరువుల విక్రయాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మెదక్ జిల్లా వ్యాప్తంగా పంటలకు అవసరమైన ఎరుపులు సగం మేర ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, అగ్రోస్, హాకా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే సరైన ధరలకు సరఫరా చేస్తుంది. మిగిలిన సగభాగం ఎరువులను ప్రైవేటు దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. రైతు వేదికలలో ఎరువులు విక్రయించేందుకు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉంది. ఏ క్లస్టర్ పరిధిలోని రైతులకు అదే క్లస్టర్ రైతు వేదిక నుంచి ఎరువులు తీసుకునేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీని దృష్టా అప్పట్లో ప్రభుత్వం ఎరువులను రైతు వేదికల ద్వారా విక్రయించేందుకు నిర్ణయించింది. దీంతోపాటు ఎరువుల విక్రయం సాఫీగా సాగితే, విత్తనాలను కూడా రైతు వేదికల ద్వారానే విక్రయాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రతి సీజన్లో ఎరువులు, విత్తనాలతో రైతంగానికి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయిన సంఘటనలు అనేకం జరిగాయి. నేటికీ జరుగుతూనే ఉన్నాయి. ఎరువుల రవాణా, నిల్వలు తదితర అంశాలు అన్నీ కూడా డీసీఎంఎస్ ద్వారా చేపట్టాలని నిర్ణయించినప్పటికీ నేటికీ అమలు జరగడం లేదు. మెదక్  జిల్లా వ్యాప్తంగా దాదాపు 3. 50 లక్షల ఎకరాల్లో వివిధ వంటల సాగు జరుగుతుంది. వీటికి దాదాపు 28. వేల  మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువుల అవసరం ఉంది. రైతు వేదికల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరిగితే రైతులకు దూర భారంతో పాటు సకాలంలో అందే
అవకాశం ఉంది. ... 

పిచ్చి మొక్కలతో కల తప్పిన వేదికలు

ఎంతో సుందరంగా, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు నేడు నిరుపయోగంగా మారాయి. అనేకచోట్ల రైతు వేదికల్లో చెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా మొలిశాయి. వేదికలు కనిపించకుండా పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. వేదికలపై కనీస నిర్వహణ లేకపోవడంతో రూ. కోట్లతో నిర్మించిన రైతు వేదికలు పిచ్చి మొక్కలకు, విష జంతువులకు నివాసంగా మారాయి. రైతు వేదికలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........