పిల్లలకు ప్లాస్టిక్ సీసాతో పాలు పడుతున్నారా..? అయితే జాగ్రత్త.....
లోకల్ గైడ్ :
ఇంట్లో చిన్నారులకు పాలను తాగించేందుకు చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరమని తెలిసినా, అలవాటుగా చాలామంది వాటినే వాడుతూ వస్తున్నారు. సాధారణంగా మహిళలు ఈ బాటిల్స్ను వేడి నీటితో కడిగి తిరిగి తిరిగి వాడుతారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, ఈ విధంగా ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల చిన్నారుల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలు ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు.ప్లాస్టిక్లోని మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరి దీర్ఘకాలిక వ్యాధులను కలిగించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి అధ్యయనాల్లో పిల్లల ఐక్యూ స్థాయిని కూడా ప్రభావితం చేస్తుందని తేలింది. ప్లాస్టిక్ సీసాలు సరైన రీతిలో శుభ్రం చేయకపోతే వాటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందని, తద్వారా పిల్లలకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
స్వీడన్లోని కార్ల్స్టాడ్ విశ్వవిద్యాలయం ఆరోగ్య శాఖ ప్రొఫెసర్ గుస్టాఫ్ బోర్న్హాగ్ తెలిపారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో వాడే బిస్ఫెనాల్ ఎఫ్ అనే రసాయనం శరీరంలో హార్మోన్లను ప్రభావితం చేస్తుందని, పిల్లల మానసిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని చెప్పారు. తల్లి గర్భంలో ఉండే సమయంలో ఈ రసాయనాల ప్రభావం ఉంటే, ఆ పిల్లల ఐక్యూ స్థాయిలో ఏడు ఏళ్ల వయస్సులోనే తేడా కనిపించవచ్చని పేర్కొన్నారు.ఇంకా, ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో 100 మంది శిశువులపై నిర్వహించిన పరిశోధనలో కూడా ఇదే విషయం బయటపడింది. తల్లిపాలు తాగే పిల్లలతో పోలిస్తే ప్లాస్టిక్ బాటిల్స్తో పాలను తాగే పిల్లల్లో ఐక్యూ పాయింట్లు 8 నుంచి 10 వరకు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అంతేగాక, అలా పాలు తాగే పిల్లల్లో ఊబకాయం, పలు వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.పిల్లల కడుపులో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఈక్సోలీ, సాల్మొనెల్లా, స్ట్రెప్టోకాకస్ వంటి బ్యాక్టీరియాల బారిన పడే అవకాశమూ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పిల్లలకు పాలను ప్లాస్టిక్ బాటిల్స్లో కాకుండా చెంచాతో తాగించాలనే సూచనను నిపుణులు ఇస్తున్నారు.
Comment List