రోజుకు ఒక యాపిల్ తింటే....

రోజుకు ఒక యాపిల్ తింటే....

జీర్ణ సమస్యలకు అద్భుత ఔషధం

"రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు" అనే నానుడి మనం చాలా రోజులుగా వింటూ వచ్చాం. ఇది కేవలం నానుడి మాత్రమే కాకుండా, యాపిల్‌కు ఉన్న అపారమైన పోషక విలువల ఆధారంగా వచ్చిన మాట కూడా. శాస్త్రీయంగా చెప్పాలంటే, యాపిల్‌లో మన శరీరానికి అవసరమైన ఎక్కువవేన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందుకే నిపుణులు దీనిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇప్పటి జీవనశైలిలో మలబద్దకం చాలా మందిని వేధిస్తున్న సమస్య. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. మలబద్దకం నుంచి పైల్స్ వరకు జరగవచ్చు. కానీ రోజూ యాపిల్ తింటే మలబద్దకం తగ్గే అవకాశముండే, జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా పనిచేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది గతంలో వృద్ధులకే పరిమితమైన గుండె పోటు సమస్యలు, ప్రస్తుతం యువతలోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు హై కొలెస్ట్రాల్, బీపీ సమస్యలు. అయితే రోజూ ఒక యాపిల్ తింటే ఈ రెండు సమస్యలూ నియంత్రణలో ఉంటాయి. ఇది రక్తనాళాలను శుభ్రంగా ఉంచి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావం ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.
అధిక బరువును తగ్గించడంలో తోడుగా అధిక బరువు ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. బరువు తగ్గాలంటే తక్కువ కాలోరీస్, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం అవసరం. యాపిల్ అందుకు సరైన ఎంపిక. ఇది తక్కువ క్యాలొరీస్‌తో పాటు ఎక్కువగా ఫైబర్‌ను అందిస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ఊపిరితిత్తులు, మెదడు, ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె, క్యాల్షియం వంటివి ఎముకల దృఢతను పెంచుతాయి.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మందికి యాపిల్ తినే అలవాటు లేదు. కానీ మెల్లగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. పోషకాహార నిపుణుల సలహా ప్రకారం – రోజూ ఒక యాపిల్.. ఆరోగ్యానికి అద్భుతమైన తోడుపాటు!

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం.. తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..
తొర్రూర్ (లోకల్ గైడ్)తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు  యశస్విని...
పెన్షన్లకు అర్హులైన వారి దరఖాస్తులు స్వీకరించాలి
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి 
రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత కంటి వైద్య శిబిరం - 300 మందికి కంటి పరీక్షలు 
పేదవారి ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.
4న టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం