వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- జన సమూహంలో మాస్క్ తప్పనిసరి.
- నిత్యం సబ్బుతో చేతులు కడుకోవాలి.
- కొద్దిపాటి నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం!
- వికారాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బుచ్చిబాబు.
లోకల్ గైడ్/తాండూర్:
వ్యాధుల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కొద్దిపాటి నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం అని వికారాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బుచ్చిబాబు సూచించారు. మంగళవారం పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లో గల గ్రామపంచాయతీ ఆవరణలో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన...టీబీ ముక్త్ భారత్ అభియాన్,అసంక్రమిత ( ఎన్సిడి) వ్యాధులు, స్క్రీనింగ్, అవగాహన సదస్సును డాక్టర్ బుచ్చిబాబు ఆధ్వర్యంలో డాక్టర్ శ్వేత నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత యాదవ్ మాట్లాడుతూ.. రక్తపోటు,హెచ్ఐవి,ఓల్డ్ టీబీ, మధుమేహం,ఆల్కహాల్, దూమపానం,డయాలసిస్, క్యాన్సర్, వంటి అనంత వ్యాధుల పట్ల 60 సంవత్సరాలు పైబడిన వారు తప్పకుండా వైద్యుల సూచన, సలహాలు, జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ రకాల వ్యాధుల గురించి అవగాహనా కల్పించినట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా...టీబీ లక్షణాలున్న ఉన్నవారికి కళ్ళే పరీక్షా చెయించటం,ఎక్స్రే కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం..వ్యాధి నిర్ధారణ జరిగితే 6 నెలల వరకు ఉచిత మందులు అందిస్తామని అన్నారు.అంతేకాకుండా వ్యాధి బారిన పడిన వాళ్లకు నెలకు పోషణ నిమిత్తం రూ.1000 ఇవ్వటం జరుగుతుంది అని స్పష్టం చేశారు.కొద్దిపాటి టీబి లక్షణాలు ఉన్నవారు టీవైసీబీ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెపి ప్రమోద్,పి హెచ్ ఎన్ అరుణకుమారి,ఎంపీహెచ్ఎస్ సుగుణ,ఏఎన్ఎం శిరీష, హెల్త్ అసిస్టెంట్ హరి శంకర్,ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్ కుమార్, ఐసిటిసి కౌన్సిలర్ పర్వతాలు అనురాధ, అనిత, టిబి హర్షవర్ధన్ రెడ్డి,ఆశ కార్యకర్తలు అనూష, మల్లేశ్వరి,పుష్ప, గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comment List