జూన్ 30 వరకు జిల్లాలో రేషన్ పంపిణీ, 

రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిసన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్,

జూన్ 30 వరకు జిల్లాలో రేషన్ పంపిణీ, 

మూడు నెలల బియ్యం సరఫరా ఒకేసారి
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
చౌక ధరల దుకాణాల ద్వారా వినియోగదారులకు సకాలంలో సన్న బియ్యాన్ని పారదర్శకంగా అందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. ఈనెల 30 వరకు బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారునాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో ఉన్న రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 558 రేషన్ షాపులకు గాను 425 రేషన్ షాపులకు రేషన్ బియ్యం పంపిణీ చేశామని,ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న  రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు.రాష్ట్ర ప్రభుత్వం  ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని మంగళవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని తెల్కపల్లి మండల కేంద్రంలోని  ఉన్న రాకొండా గ్రామంలోని 15వ నెంబర్ చౌక ధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ చౌక ధరల దుకాణాన్ని పరిశీలించి, సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఈపాస్ డివైస్‌లో కొత్తగా అమలులోకి వచ్చిన సాఫ్ట్ వేర్  పని తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలలో అసంతృప్తి లేకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అందుతున్న రేషన్ సేవలపై వారు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే అంశంపై ఫీల్డ్ లెవెల్ లో 'గ్రౌండ్ రియాలిటీ'ని స్వయంగా జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. రేషన్ షాపులో స్టాక్ రిజిస్టర్ నిర్వహణ, స్టాక్ వివరాలు ప్రదర్శించే బోర్డులు, బయోమెట్రిక్ ఈపాస్ యంత్రాల పనితీరు, రిజిస్టర్ ప్రకారం ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనే వివరాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. దుకాణంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారు ఎలాంటి సేవలు పొందుతున్నారు అనే విషయాలను కలెక్టర్ అక్కడి అధికారులు, డీలర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. రాకొండా గ్రామంలో ఉన్న 650 మంది రేషన్ కార్డుదారులకు మూడు నెలల బియ్యం సరఫరా ఒకేసారి అందించగలుగుతున్నారా అనే అంశంపైనా ప్రశ్నించారు. రేషన్ బియ్యం నాణ్యత, సరఫరా తీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, లబ్ధిదారులకు పారదర్శక విధానంలో, సకాలంలో నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన
-క్యాన్సర్, జనరల్ సర్జరీలు, యూరాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ
చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం
ఎరుపు లేదా తెలుపు..? ఏ రంగు ఉల్లిపాయ తినితే ఆరోగ్యానికి ఎక్కువ మేలు?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలసిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి
వికాస తరంగిణి సభ్యులకు యోగా పై అవగాహన.....
బడిబాటలో భాగంగా జెడ్పిహెస్ ఓబులకేశ్వపూర్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ దర్శనం భొజన్న
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం - డీఈఓ రమేష్ కుమార్