హైదరాబాద్ వాసులకు శుభవార్త!

హైదరాబాద్ వాసులకు శుభవార్త!

హైదరాబాద్ వాసులకు శుభవార్త! నగరంలో పాదచారుల భద్రతను పెంచడాన్ని లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా, కొత్తగా 86 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల (FOBs) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేకాకుండా, 500 కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ప్రస్తుతంలో ఉన్న 23 FOBలను ప్రకటనల కోసం వినియోగించి ఆదాయం పొందాలని GHMC యోచిస్తోంది.ఈ చర్యలు నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించి, పాదచారులకు మరింత భద్రత కల్పిస్తాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ వేగంగా విశ్వనగరంగా ఎదుగుతున్న కొద్దీ, ట్రాఫిక్ రద్దీ ప్రధాన సవాలుగా మారుతోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొత్త అండర్‌పాసులు, విస్తృత రహదారులు, ప్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. రద్దీ సమయంలో రోడ్లు దాటడం కష్టంగా మారిన నేపథ్యంలో, GHMC తీసుకుంటున్న ఈ చర్యలు నగర ప్రజలకు ఎంతో ఉపయోగపడనున్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News