బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

 -కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

కామారెడ్డి ,లోకల్ గైడ్ :
            జిల్లాలో బాల కార్మిక సమస్యను సమూలంగా నిర్మూలించేందుకు మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద కుటుంబాల నుండి వచ్చే పిల్లలు విద్యను మధ్యలోనే వదిలి చిన్నతనంలోనే ఉద్యోగాలలో చేరుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల 14 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని తెలిపారు.
తల్లి తండ్రులు పిల్లలను పని చేయమని పంపడం వలన వారి ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. బాల కార్మికులను గుర్తించే విషయంలో గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది బాధ్యతగా ఉండాలని చెప్పారు. 14 ఏళ్లు నిండిన వారు కూడా ప్రమాదకరమైన ఉద్యోగాలలో చేరరాదని హెచ్చరించారు. 18 ఏళ్లు నిండకముందే వారు బాగా శ్రమ పడుతున్నారని అన్నారు .ఈ కార్యక్రమంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రమీల , సూపరిండెంట్ విజయభాస్కర్ , అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కోటేశ్వర్లు ,  డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్రవంతి, సాధన కోఆర్డినేటర్ గిరిజ తదితరులు పాల్గొన్నారు .

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రవికుమార్ యాదవ్ ను కలిసిన బీజేపీ శ్రేణులు  రవికుమార్ యాదవ్ ను కలిసిన బీజేపీ శ్రేణులు 
లోకల్ గైడ్ శేరిలింగంపల్లి:విదేశీ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని సొంతింటికి తిరిగి వచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ ను...
రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం
మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్
రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు
రాత్రి పూట భోజ‌నం అనంత‌రం 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఇన్ని లాభాల.....
ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 మ్యాచు!