ఇందిరా సౌర గిరి పథకం రైతులకు రాష్ట్ర స్థాయి శిక్షణ,

గిరిజన రైతులు మాస్టర్ ట్రైనర్స్ గా,

ఇందిరా సౌర గిరి పథకం రైతులకు రాష్ట్ర స్థాయి శిక్షణ,

నల్లమల్ల రైతులకు ఉద్యాన శిక్షణ,
 రాష్ట్రానికి నల్లమల్ల ఆదర్శంగా మారాలి,
గిరిజన రైతుల ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా,
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా ,
నల్లమల్ల ఇందిరా సౌర గిరి వికాసం రైతులకు రాష్ట్రస్థాయి ఉద్యాన పరిశోధన శిక్షణా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ,నల్లమల్ల గిరిజన రైతులు ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని రాష్ట్రస్థాయి శిక్షకులుగా మారాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఇందిరా సౌర గిరి జల వికాస లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు. ఉద్యాన పంటలపై పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాత రాష్ట్రస్థాయిలో వారి సేవలు వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.మే  నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరి వికాసం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, 30 మంది లబ్దిదారులకు ఉద్యాన పండ్ల మొక్కలు సాగు చేస్తున్న ముగ్గురు నల్లమల్ల రైతులకు రాష్ట్రస్థాయిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ అందించి వారి సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈ సందర్భంగా తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్తన చాంబర్లో  ఇందిరా  సౌర గిరి జల వికాస లబ్ధిదారులైన కే. రాజకుమార్, యు లక్ష్మి, యు అలివేల, లతో కలెక్టర్ మాట్లాడారు.  పాలెం కె.వి.కె, నల్లగొండ మల్లేపల్లి ఉద్యాన శిక్షణా కేంద్రం, సంగారెడ్డి ఉద్యాన శిక్షణా, పరిశోధన కేంద్రాల్లో ఉద్యాన పంటలపై పూర్తిస్థాయి శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ వారికి తెలిపారు. శిక్షణ అనంతరం రాష్ట్రస్థాయిలో ఇందిరా సౌర గిరి జలవికాసం పథకాన్ని నల్లమల్ల ప్రాంతం నుండి రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్స్  గా వ్యవహరించాల్సి ఉంటుందని, శిక్షణ తరగతుల్లో ఆ విధమైన నైపుణ్యాన్ని అందిపిచ్చుకోవాలని కలెక్టర్ ఇందిరా గిరి వికాస లబ్ధిదారు రైతులకు సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కెవికె పాలెం పరిశోధనా కేంద్రంలో అన్ని రకాల ఉద్యాన పంటలపై, నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లి ఉద్యాన పరిశోధనా శిక్షణ కేంద్రంలో నిమ్మ, బత్తాయి పంట సాగుపై, సంగారెడ్డి జిల్లా ఉద్యాన శిక్షణ పరిశోధనా కేంద్రంలో మామిడి పంట సాగు పై పూర్తిస్థాయిలో శిక్షణ తరగతులను అందించనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ఇందిరా సౌర గిరి జల వికాసం పథకానికి నాగర్ కర్నూల్ జిల్లా ఇందిరా సౌర గిరి జల వికాసం రైతులు రాష్ట్రస్థాయి సౌర గిరి లబ్ధిదారులకు శిక్షణా తరగతులను అందించేలా వారిని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,  వారితో మాట్లాడుతూ......   రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఆదివాసి, గిరిజన రైతుల ఆర్థిక అభ్యున్నతి పొందేలా కృషి చేయాలని, ఆ విధమైన శిక్షణ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఉద్యాన పంటలతో పాటు మామిడి, అవకాడ, బత్తాయి,  జీడి మామిడి, కొబ్బరితో పాటు జామ, సీతాఫలం, నిమ్మ, నేరేడు, రేగు, మునగ, గులాబీ, మల్లె వంటి పూలు, ఆయుర్వేద, సుగంధ తైల మొక్కల సాగు, మార్కెటింగ్, తదితర అంశాలపై క్షుణ్ణంగా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు ఇందిరా సౌర గిరి రైతులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.  గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, బీడు భూములకు నూతన జీవం పోసే మార్గంగానే ఎన్నో రకాల పండ్ల తోటల సాగుకు నాంది పలకడం జరిగిందని, శిక్షణ కేంద్రంలో ఉద్యాన శాస్త్రవేత్తల  సలహాలు తీసుకుని, గిరిజనుల భూముల్లో అనువైన పండ్ల తోటల పంటల సాగుకు రాష్ట్రవ్యాప్తంగా కృషి చేయాలని, ఇందిరా సౌర గిరి వికాస రైతులందరి ఆదాయాన్ని రెట్టింపు చేసేలా మీ కృషి ఉండాలని, అప్పుడే ఈ నల్లమల్ల ప్రాంతానికి దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని కలెక్టర్ సూచించారు. నల్లమల ప్రాంత రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కింద కృషి చేయాలని ,ఈ పథకం విజయవంతంగా అమలు చేయడం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, నల్లమల ప్రాంతానికి దేశ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పథకం కేవలం ఆర్థిక ప్రగతిని మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని నొక్కి చెప్పారు. సౌర శక్తి వినియోగం ద్వారా నల్లమల అటవీ ప్రాంతంలో విద్యుత్ అవసరాలను తీర్చడం, తద్వారా అటవీ సంపదకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడటం ఇందిరా సౌర గిరి వికాస పథకంలోని కీలక అంశమని తెలిపినారు. నల్లమల ప్రాంతంలోని రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాసం ఒక నూతన ఆశాకిరణంగా నిలుస్తుందని, వారి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు. అంతిమంగా, ఈ సమగ్ర కృషి నల్లమల ప్రాంతాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేస్తుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన