తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ల బంద్ ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ల బంద్ ఉండే పరిస్థితి కనిపించడం లేదు.


లోక‌ల్ గైడ్ : 
థియేటర్ల యజమానులు మరియు నిర్మాతల మధ్య కొనసాగిన విభేదాలు చర్చల ద్వారా పరిష్కారం దిశగా సాగుతున్నట్లు సమాచారం. పరిశ్రమలో ఉన్న సమస్యలను పరస్పర అవగాహనతో చర్చించుకుని పరిష్కరించేందుకు సినీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.ఈ క్రమంలో సమస్యల సమగ్ర పరిష్కారానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ మే 30వ తేదీ నుండి వరుస సమావేశాలు నిర్వహించనుంది. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడమే కమిటీ లక్ష్యం.ప్రస్తుతం థియేటర్ల రెవెన్యూ షేరింగ్ విధానంపై నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు జూన్ 1 నుంచి థియేటర్ల సమ్మెకు వెళ్లాలని నిర్ణయించిన ఎగ్జిబిటర్లు, తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నిర్వహించిన కీలక సమావేశంలో, రెండు పక్షాలు కూడా సమస్యల పరిష్కారానికి సామరస్యపూర్వక దారి కనుగొనాలని ప్రయత్నించాయి. దీనిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన వెలువడనుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం.. తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..
తొర్రూర్ (లోకల్ గైడ్)తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు  యశస్విని...
పెన్షన్లకు అర్హులైన వారి దరఖాస్తులు స్వీకరించాలి
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి 
రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత కంటి వైద్య శిబిరం - 300 మందికి కంటి పరీక్షలు 
పేదవారి ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.
4న టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం